కూకట్ పల్లి నియోజకవర్గం,నిజాంపేట్ చౌరస్తా సర్దార్ పటేల్ నగర్ కమాన్ దగ్గర ఉక్కు మనిషి భారత రత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 144 వ జయంతి సందర్బంగా జాతీయ ఏకతా దివస్ పురస్కరించుకొని ఉక్కు మనిషి భారత రత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ ఏకతా దివస్ ప్రతిజ్ఞ చేసిన అనంతరం కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రివర్యులు శ్రీ పురుషోత్తం రూపాల మహాత్మా గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్య సభ సభ్యులు శ్రీ గరికపాటి రామ్మోహన్ రావు,హైదరాబాద్ మహానగర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మరియు యం.ఎల్.సి. శ్రీ రామచంద్రా రావు గారు, మాజీ యం.ఎల్.సి. శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీ ఎస్. మల్ల రెడ్డి, శ్రీ శివరాత్రి దామోదర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ మాధవరం కాంత రావు, బాలాజీ నగర్ కార్పొరేటర్ శ్రీమతి పన్నాల కావ్య రెడ్డి , సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ శ్రీ పన్నాల హరీష్ చంద్రా రెడ్డి, శ్రీ పద్మయ్య , శ్రీ వినోద్ గారు డివిజన్ అధ్యక్షులు శ్రీ హరి బాబు, శ్రీ వినోద్ కుమార్ గౌడ్, భారతీయ జనతా యువ మోర్చా నాయకులు శ్రీ ప్రీతం రెడ్డి, పవన్ రెడ్డి,మరియు కూకట్ పల్లి భారతీయ జనతా పార్టీ వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉక్కు మనిషి భారత రత్న శ్రీసర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి